
- కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి టౌన్, వెలుగు : ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి మండలం ఉగ్రవాయి యూపీఎస్ స్కూల్లో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.