
కామారెడ్డిటౌన్, వెలుగు:మొబైల్ ఫోరెన్సిక్వెహికల్ను గురువారం ఎస్పీ రాజేశ్చంద్ర జెండా ఊపి ప్రారంభించారు. నేరాలు జరిగినప్పుడు సంఘటనా స్థలాల్లో సాక్ష్యాలను సేకరించి నిందితులను గుర్తించేందుకు
ఫోరెన్సిక్ విభాగానికి వెహికల్ కేటాయించారు.
ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అత్యాధునిక పరికరాలతో రూపొందించిన మొబైల్ ఫోరెన్సిక్వెహికల్ మెరుగైన సేవలు అందించనుందన్నారు. నేరం జరిగిన స్థలంలో ఫింగర్ ఫ్రింట్స్, పలు రకాల సాక్ష్యాలు సేకరించవచ్చన్నారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్రావు, సీఐ శ్రీధర్ పాల్గొన్నారు.