ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోండి : ఎస్పీ రాజేశ్చంద్ర

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోండి : ఎస్పీ రాజేశ్చంద్ర
  • ఎస్పీ రాజేశ్​చంద్ర

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని  ఎస్పీ రాజేశ్​చంద్ర అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలను  ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. నిజాంసాగర్​ చౌరస్తాలో వెహికల్స్​ టర్నింగ్​కు కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలన్నారు. వీ6 వెలుగులో ప్రచురితమైన ‘ట్రాఫిక్​ పీఎస్​ వచ్చేనా..?’ కథనానికి ఎస్పీ స్పందించారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి, టౌన్ సీఐ నరహరి, ఎస్​బీ సీఐ శ్రీధర్​ తదితరులు ఉన్నారు. 

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి 

భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేశ్​ చంద్ర సూచించారు. బుధవారం కామారెడ్డి, అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 100 డయల్​ చేయాలన్నారు. కలెక్టరేట్​లో కంట్రోల్​ రూమ్​  నం. 08468- 220069కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. వరద ఉధృతంగా ప్రవహించే చోటుకు ప్రజలు వెళ్లవద్దన్నారు.  రోడ్లకు ఇరువైపులా స్టాపర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా ఇండ్లు కూలే పరిస్థితి ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.