ఇంద్రకీలాద్రిపై సరస్వతిదేవి అలంకారంలో కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై సరస్వతిదేవి అలంకారంలో కనకదుర్గమ్మ

విజయవాడ: వసంత పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అధికారులు వేద పండితుల ఆధ్వర్యంలో సరస్వతీ హోమం నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా ప్రతియేడాది విద్యార్థులుకు ఉచిత దర్శనం, పెన్ను, ప్రసాదం అందజేసేవారు. అయితే ఈయేడాది కోవిడ్ ఆంక్షల కారణంగా అలాంటి ఏర్పాట్లు చేయలేదని దేవస్థానం ఈవో భ్రమరాంబ తెలిపారు. అలాగే కోవిడ్ వ్యాప్తి కారణంగా భక్తులు హోమంలో పాల్గొనే అవకాశం కల్పించలేదని ఈవో వివరించారు.