రెండు బైక్ లు ఢీ.. చెలరేగిన మంటలు .. ఓ వ్యక్తి బండితో పాటు సజీవదహనం

రెండు బైక్ లు  ఢీ.. చెలరేగిన మంటలు ..  ఓ వ్యక్తి బండితో పాటు సజీవదహనం

కాకినాడ జిల్లా తునిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ఓ వ్యక్తి బండితో సహా సజీవ దహనమయ్యాడు. బెండపూడి, కత్తిపూడి మధ్య ఉన్న హైవేపై రెండు బైక్ లు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఈ ఘటనలో రెండు  దగ్ధం కాగా.. ఓ వ్యక్తి బైక్‌పైనే సజీవదహనం అయ్యాడు.  మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.