
కాజీపేట, వెలుగు : నాయిని విశాల్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించిన నాయిని టీ 10 క్రికెట్ మ్యాచ్ లీగ్ ఫైనల్ ఆదివారం ముగిసింది. ఈ లీగ్ లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 176 టీమ్ లు పాల్గొనగా, కాజీపేట సురేశ్ టీమ్ విజేతగా నిలవగా, రన్నరప్ గా అలంకార్ ఫిరోజ్ టీమ్ నిలిచింది.
విజేత టీమ్ కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రూ.లక్ష చెక్కును ప్రైజ్ మనీగా ఇచ్చారు. రన్నరఫ్ టీమ్ కు రూ.50వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్తె, అల్లుడు గోదా, విష్ణువర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.