- కడియం..కేసీఆర్ గడీల దగ్గర పెద్ద జీతగాడు
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ
స్టేషన్ఘన్పూర్, వెలుగు: తన కొడుకు రాజ్యాన్ని ఏలాలనే దురాలోచనతోనే సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఏప్రిల్4న నిర్వహించనున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక రాష్ట్ర సదస్సును స్టేషన్ఘన్పూర్లోని జాఫర్గఢ్ రోడ్డులో ఉన్న పద్మావతి కన్వెన్షన్ హాల్లో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి ఇనుముల నర్సయ్య ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. దీనికి మందకృష్ణ మాదిగ చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. 2023లో కేసీఆర్ రాజకీయ సమాధి కావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ ఏనాడు అంబేద్కర్ను గౌరవించలేదన్నారు. కేసీఆర్కు మద్దతుగా కడియం శ్రీహరి మాట్లాడి దళితులకు ద్రోహం చేశాడన్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్తో దళిత ద్రోహి అని తేలిపోయిందన్నారు. కేసీఆర్ గడీల దగ్గర పెద్ద జీతగాడి లెక్క కడియం పనిచేసుకోవాలని, ఎస్సీ నియోజకవర్గమైన స్టేషన్ఘన్పూర్లోకి రావొద్దన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు చేసిన కుట్రలపై కడియం శ్రీహరికి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.
అందుకే ప్రశాంత్కిశోర్ను తెచ్చిండు: కోదండరాం
తన నిరంకుశత్వానికి తిరుగుండొద్దనే దుర్మార్గపు ఆలోచనతోనే సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై కుట్రలు చేస్తున్నారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. కేసీఆర్ పనై పోయిందని, ఇది తెలిసే ప్రశాంత్కిశోర్ను అద్దెకు తెచ్చుకున్నాడని విమర్శించారు. ప్రశాంత్ కిశోర్ పైసల మనిషని, సమాజం గురించి ఆలోచించడన్నారు.
రాజ్యాంగాన్ని మార్చాలనే భావన వద్దు : ప్రొఫెసర్ హరగోపాల్
రాజ్యాంగాన్ని మార్చాలని ఓ నేత, హక్కుల వలన దేశం బలహీనపడుతోందని మరో నేత మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే భావనను విడనాడాలని సీఎం కేసీఆర్ను సభా ముఖంగా డిమాండ్ చేస్తున్నానన్నారు. ప్రొఫెసర్ జేబీ రాజు, ప్రొఫెసర్ కాశీం, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఎల్హెచ్పీఎస్ వ్యవస్థాక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్,ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్బ్యూరో మెంబర్ బొడ్డు దయాకర్, రాష్ట్ర నాయకుడు తిప్పారపు లక్ష్మణ్ , ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా లీడర్ కొయ్యడ మల్లేశ్, జనగామ జిల్లా ఇన్చార్జి ఇనుముల నర్సయ్య , ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్, మండల అధ్యక్షుడు చాడ ఏలియా పాల్గొన్నారు.