V6 News

కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు : తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీ కైవసం.. 45 ఏళ్ల కామ్రేడ్ల కోటలో కాషాయం

కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు : తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీ కైవసం.. 45 ఏళ్ల కామ్రేడ్ల కోటలో కాషాయం

కేరళలో మొత్తం 1,199 స్థానిక సంస్థలకు (పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) రెండు దశల్లో పోలింగ్ జరగ్గా... శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఇదొక ముందస్తు పరీక్షగా భావిస్తుండటంతో ఫలితాలపై అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

ఇప్పటివరకు ఉన్న ట్రెండ్‌ల ప్రకారం, అధికారంలో ఉన్న LDF (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ - ఇందులో సీపీఎం ప్రధాన పార్టీ) గ్రామాలలోని చాల  గ్రామ పంచాయతీలలో, బ్లాక్ పంచాయతీలలో ముందుంది. అయితే ప్రతిపక్ష పార్టీ UDF (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ - ఇందులో కాంగ్రెస్ ప్రధాన పార్టీ) మాత్రం చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆధిక్యం చూపుతోంది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏకైక అతిపెద్ద పార్టీగా తయారైంది. ఇక్కడ సీపీఎం (CPM) హవా తగ్గి  బీజేపీ బలం పుంజుకుంది అని చెప్పవచ్చు.

అధికారులు మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో (EVMలు) నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 244 లెక్కింపు కేంద్రాలు, 14 జిల్లా కలెక్టరేట్లలో ఈ కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నికైన పంచాయతీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు జరుగుతుంది, కొత్తగా ఎన్నికైన కార్పొరేషన్ కౌన్సిలర్లు అదే రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.

1995 తర్వాత అత్యధిక ఓటింగ్ శాతం: 
1995లో జరిగిన తొలి పౌర ఎన్నికల తర్వాత ఈ సంవత్సరం కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు ఓటింగ్ శాతం నమోదు చేశారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) గణాంకాల ప్రకారం, రెండు దశల్లో నిర్వహించిన రెండవ దశలో 76.08 శాతం పోలింగ్ నమోదైంది. డిసెంబర్ 9న జరిగిన మొదటి దశలో 70.91 శాతం పోలింగ్ నమోదైంది, దీంతో మొత్తం ఎన్నికల్లో 73.69 శాతం పోలింగ్ నమోదైంది.

కేరళలోని 1,199 స్థానిక సంస్థలకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా...  చాల గ్రామ, బ్లాక్ పంచాయతీలలో అధికార LDF ముందంజలో ఉండగా, ప్రతిపక్ష UDF మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ముందంజలో ఉంది. కార్పొరేషన్ల వారీగా చూస్తే, యుడిఎఫ్ ప్రస్తుతం కొచ్చి, త్రిస్సూర్, కన్నూర్, కొల్లంలలో ఆధిక్యంలో ఉంది, గత స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే గొప్ప మెరుగుదల. ఎల్డిఎఫ్ & ఎన్డిఎ ఒక్కొక్క కార్పొరేషన్లో ఆధిక్యంలో ఉన్నాయి.

మునిసిపాలిటీలు పరిశీలిస్తే యుడిఎఫ్ ఇప్పటివరకు 48 మునిసిపాలిటీలలో ఆధిక్యంలో ఉంది. ఎల్డిఎఫ్ 30 మునిసిపాలిటీలలో, ఎన్డిఎ ఒక మునిసిపాలిటీలో ఆధిక్యంలో ఉండగా, ఐదు మునిసిపాలిటీలో సమానంగా ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం, ఎర్నాకుళం కార్పొరేషన్‌లో యుడిఎఫ్ 44 వార్డులలో ఆధిక్యంలో కొనసాగుతోంది.