V6 News

మెస్సీ జట్టుపై గోల్ కొట్టిన సీఎం రేవంత్.. గ్రౌండ్‎లోకి వచ్చి రాగానే ఎటాక్

మెస్సీ జట్టుపై గోల్ కొట్టిన సీఎం రేవంత్..  గ్రౌండ్‎లోకి వచ్చి రాగానే ఎటాక్

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి, మెస్సీ అపర్ణ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచులో మ్యాచ్ 18వ నిమిషంలో గ్రౌండ్‎లోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాగానే గోల్ కొట్టి అలరించారు. యువకులతో పోటీ పడి మరీ సీఎం రేవంత్ రెడ్డి గోల్ కొట్టడంతో అభిమానుల కేరింతలతో ఉప్పల్ స్టేడియం దద్దరిల్లింది.

 అనంతరం గ్రౌండ్‎లోకి దిగిన మెస్సీ కాసేపు సీఎం రేవంత్ తో సరదాగా మ్యాచ్ ఆడారు. అనంతరం ఇరుజట్లు పెనాల్టీ షూటౌట్‎లో పాల్గొన్నాయి. షూటౌట్‎లో సీఎం రేవంత్ గోల్ కొట్టడంతో మెస్సీ చప్పట్లు కొట్టి అభినందించారు. మ్యాచ్ అనంతరం ప్లేయర్స్‎తో కలిసి మెస్సీ ఫొటో దిగారు. బాల్స్‎ను స్టేడియం స్టాండ్స్‎లోకి కిక్ చేసి అలరించారు మెస్సీ. తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి స్టేడియంలో తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. 

కాగా, గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) మెస్సీ హైదరాబాద్‎కు వచ్చారు. కోల్‎కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ భారీ బందోబస్తు నడుమ అక్కడి నుంచి నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్‏కు వెళ్లారు. ఫలక్ నుమా ప్యాలెస్‎లో మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 

ఆ తర్వాత గోట్ ఇండియా టూ‎ర్లో భాగంగా ఫలక్ నుమా ప్యాలెస్‎లో నిర్వహించిన ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మీట్ అండ్ గ్రీట్‎లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు. ఈ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఉప్పల్ స్టేడియానికి వచ్చారు.