
కౌలాలంపూర్: ఆరేండ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్లో ఫైనల్ చేరిన ఇండియా స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ టైటిల్ అందుకోలేకపోయాడు. మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో అత్యుత్తమ పెర్ఫామెన్స్ చేసినప్పటికీ రన్నరప్తో సరిపెట్టాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీకాంత్ 11-–21, 9–-21 తేడాతో చైనాకు చెందిన నాలుగో ర్యాంకర్ లీ షి ఫెంగ్ చేతిలో వరుస గేమ్స్లో ఓడిపోయాడు. సెమీఫైనల్ వరకూ సూపర్ పెర్ఫామెన్స్ చేసిన శ్రీ టైటిల్ ఫైట్లో అదే జోరు చూపించలేకపోయాడు.
రెండు గేమ్స్లోనూ ప్రత్యర్థికి పెద్దగా పోటీ ఇవ్వలేకపోవడంతో మ్యాచ్ 36 నిమిషాల్లోనే ముగిసింది. గాయాలు, ఫామ్ లేమితో సుదీర్ఘకాలం ఇబ్బంది పడిన 32 ఏండ్ల శ్రీకాంత్ ఈ టోర్నీలో క్వాలిఫయర్స్ నుంచి ఫైనల్ వరకు దూసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒకప్పుడు వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ అందుకున్న తెలుగు కుర్రాడు ఈ నెల ఆరంభంలో 82వ ర్యాంకుకు పడిపోయాడుతను ఈ మెగా టోర్నీలో రన్నరప్గా నిలవడంతో తిరిగి ఫామ్ అందుకున్నట్టు చెప్పొచ్చు. ఫైనల్లో ఓడినా ఈ టోర్నీలో తన ఆట పట్ల సంతృప్తిగా ఉన్నానని శ్రీకాంత్ చెప్పాడు. చాలా కాలం తర్వాత మళ్లీ పోడియంపై నిలవడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందని అన్నాడు.