
కోనరావుపేట, రాయికల్, వెలుగు : అకాల వర్షాలతో రైతులు ఆగమవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్ల జాప్యంతో వానకు తడిసి మొలకెత్తుతున్నాయి. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు సెంటర్లలో వడ్లు పోసి రెండు నెలలవుతున్నా కొనుగోళ్లు పూర్తికాకపోవడంతో వానలకు తడుస్తూ మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో కొనుగోలు సెంటర్లలో ఆరబోసిన వడ్లు వానకు తడిసి మొలకెలత్తాయి. నిర్వాహకుల జాప్యంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.