మహాత్ముడికి గవర్నర్, సీఎం నివాళి

 మహాత్ముడికి గవర్నర్, సీఎం నివాళి

మెహిదీపట్నం, వెలుగు: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు హైదరాబాద్ లంగర్​ హౌస్​లోని బాపూఘాట్ లో గురువారం ఘనంగా జరి గాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బాపూఘాట్​లోని​సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. గాంధీజీ సేవలను కొనియాడారు. అనంతరం గాంధీ మ్యూజియం హాల్​లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. 

ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, బీసీ కమిషన్ చైర్మన్  నిరంజన్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, పర్యాటకశాఖ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.