గార్ల రైల్వే స్టేషన్​లో ఎక్స్​ ప్రెస్​లను ఆపాలి : మాలోతు కవిత

గార్ల రైల్వే స్టేషన్​లో ఎక్స్​ ప్రెస్​లను ఆపాలి : మాలోతు కవిత

మహబూబాబాద్​, వెలుగు: జిల్లాలోని గార్ల  రైల్వే స్టేషన్ లో శాతవాహన, ఇంటర్​సిటీ ఎక్స్​ ప్రెస్​లు ఆపాలని  బుధవారం మహబూబాబాద్​ ఎంపీ మాలోతు కవిత  ఆధ్వర్యంలో హైదరాబాద్​లో  రైల్వే జీఎంకు వినతి పత్రం అందించారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గార్ల రైల్వే స్టేషన్​లో  రెండు ప్లాట్ ఫారాలు  పెంచాలని , ఎలక్ట్రిక్​ డిస్​ప్లే ఏర్పాటు చేయాలని  కోరారు. ఈ కార్యక్రమంలో పానుగంటి రాధాకృష్ణ, ఎంఏ జలీల్, మురళీ గౌడ్, గంజి ఈశ్వర్ లింగం,బాదం రాజేశ్, సోమ్లా నాయక్,  శ్రీను, దాశరధి, రాము, తదితరులు పాల్గొన్నారు.