టేక్మాల్‌లో రైతులు నిర్మించుకున్న బ్రిడ్జి పరిశీలన

టేక్మాల్‌లో రైతులు నిర్మించుకున్న బ్రిడ్జి పరిశీలన
  • వెలుగు కథనానికి స్పందించిన మంత్రి ​రాజనర్సింహ

టేక్మాల్, వెలుగు: గత నెల 21న వెలుగు దినపత్రికలో ‘టేక్మాల్​ రైతుల ఆదర్శం’ అనే శీర్షికన పబ్లిష్ అయిన కథనానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ డీఈ ప్రభాకర్, ఏఈ వెంకట్ గుండువాగుపై రైతులు నిర్మించుకున్న బ్రిడ్జిని బుధవారం పరిశీలించారు. 

అన్నదాతలు వాగు అవతలివైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు వీలుగా కిలోమీటర్ ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి రూ.25 లక్షలు, 6 కల్వర్టులు, బ్రిడ్జి నిర్మాణాలకు రూ.45 లక్షలు, అదనంగా మరమ్మతులకు రూ.3 లక్షలు మొత్తం రూ.73 లక్షలతో ఎస్టిమేషన్​తయారు చేసి, ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. కాంగ్రెస్​మండల అధ్యక్షుడు నిమ్మ రమేశ్, నాయకులు సాగర్, పాపయ్య, సుధాకర్, మోహన్ రాజు, శివమల్లయ్య, సాయిశేషు తదితరులున్నారు.