
- పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్తో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ
హైదరాబాద్, వెలుగు: మంత్రిగా నియమితులైన వాకిటి శ్రీహరి శనివారం గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఇచ్చిన ఈ పదవిని బాధ్యతగా నిర్వ ర్తిస్తానని చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజల్లో ఉంటూ సేవ చేస్తానని, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన మక్తల్ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల సహకారంతోనే తాను మంత్రినయ్యానని చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ బిడ్డ, ప్రజల్లో ఉండే వ్యక్తి వాకిటి అని ప్రశంసించారు. ప్రజల మధ్య నిలిచే వ్యక్తి కి మంత్రి పదవి రావడం సంతోషకరమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.