
కాజీపేట, వెలుగు: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతీ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ, కాజీపేట నగరాల్లోని 49 వడివిజన్ ఇందిరమ్మ, గణేశ్నగర్ కాలనీల్లో పర్యటించారు.
కాజీపేటలోని 63వ డివిజన్ తిలక్ నగర్, జూబ్లీ మార్కెట్ లో రూ.1.70 కోట్లతో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైన్లు, కల్వర్టు నిర్మాణ పనులకు ఎంపీ కడియం కావ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. గ్రంథాలయ సంస్థ హనుమకొండ జిల్లా చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు విజయశ్రీ రజాలీ, రవీందర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకూస్ తదితరులు పాల్గొన్నారు.