
బాన్సువాడ, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పేద బిడ్డల పెళ్లికి ఇబ్బంది కలగొద్దనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. బాన్సువాడ టౌన్, బాన్సువాడ రూరల్, నస్రుల్లాబాద్, బీర్కుర్ మండలాలకు చెందిన 122 మంది లబ్ధిదారులకు రూ.1.22 కోట్ల విలువైన చెక్కులు అందించినట్లు పేర్కొన్నారు. నస్రుల్లాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దుర్గం శ్యామల, డీఏవో సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ..
వర్ని, వెలుగు: రుద్రూర్ కు చెందిన వైస్ఎంపీపీ నట్కరి సాయిలు తండ్రి రాములు, రాయకూర్కు చెందిన విండో చైర్మన్ పురుచూరి సంగమేశ్వర్కుమారుడు రవి ఇటీవల మృతిచెందారు. బాధిత కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి శనివారం పరామర్శించారు. రుద్రూర్విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, మాజీ చైర్మన్పత్తి రాము, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట అరుణ్, మాజీ జడ్పీటీసీ నరోజి గంగారాం
తదితరులున్నారు.