
- ఎమ్మెల్యే రోహిత్ రావు
మెదక్, వెలుగు: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో 311 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్పత్రాలను హౌసింగ్ పీడీ మాణిక్యం, ప్రజాప్రతినిధులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు పదేళ్ల కాలంలో కుంటి సాకులతో కాలం వెళ్లదీశారే తప్ప మెదక్ నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు.
అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రామాయంపేటలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ
చిన్నశంకరంపేట: స్కూల్ప్రారంభ రోజే స్టూడెంట్స్కు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించామని ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట జడ్పీ హై స్కూల్లో హెచ్ఎం దీప్లా రాథోడ్ తో కలిసి ఎమ్మెల్యే స్టూడెంట్స్కు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి విద్యార్థి పై రూ.లక్ష కు పైగా ఖర్చు చేసి అన్ని సౌకర్యాలను కల్పిస్తుందన్నారు.
కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోచయ్య, బాలరాజు, వినయ్, రతన్, నవీన్, కిషన్, సునీత, వాణి పాల్గొన్నారు. అనంతరం మండలంలో 471 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు గోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిద్ధిరాం రెడ్డి, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, పుల్లారావు, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.