
నవీపేట్, వెలుగు : రిజిస్టర్ లో సంతకాలు పెట్టి డుమ్మా కొట్టే టీచర్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఎంపీడీవో ఆఫీస్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా తొమ్మిది రోజుల్లో పూర్తి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కోస్లీలో రెండు కుటుంబాలు, నాగేపూర్లో ఒక కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ప్రమాద బీమా, ఇందిరమ్మ ఇండ్ల బిల్లు చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతి రెడ్డి రాజారెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీవో నాగనాథ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, నవీన్ రాజ్, నిరడి బుచ్చన్న, భగవాన్ పాల్గొన్నారు.
ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయండి
బోధన్,వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్చేయాలని ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం బోధన్ ఎంపీడీవో ఆఫీస్లో నియోజవర్గంలోని అన్ని శాఖల అధికారులతో అడిషనల్ కలెకర్ అంకిత్తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడారు. బోధన్, బోధన్ టౌన్, సాలూర, ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాల వారీగా అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఏస్థాయిలో ఉన్నాయని హౌసింగ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధులపై వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. మురికి కాల్వలు, డ్రైనేజీల్లో దోమల నివారణ మందులు పిచికారీ చేయాలన్నారు. ప్రభుత్వ స్కూల్స్లో పుస్తకాలు, నోట్ బుక్లు సకాలంలో అందించాలన్నారు. రెవెన్యూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మార్వోలకు సూచించారు. సమీక్షలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఉర్దు అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్,తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.