
- ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్
భద్రాచలం, వెలుగు : ఆదివాసీ గిరిజన గ్రామాల్లో తల్లిపాలపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆఫీసర్లకు సూచించారు. సబ్ కలెక్టర్ ఆఫీసులో గురువారం తల్లిపాల వారోత్సవాల్లో వారు పాల్గొని మాట్లాడారు. ఐసీడీఎస్ ఆఫీసర్లు అంతా గ్రామాల్లోకి వెళ్లి తల్లిపాల విశిష్టతను వివరించాలన్నారు.
పుట్టిన ప్రతీ బిడ్డకు మొదటి గంటలోపు తప్పనిసరిగా తల్లిపాలు పట్టాలని గర్భిణులకు సూచించారు. ఈ సందర్భంగా 15 మంది గర్భిణులకు బాలామృతం అందించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో స్వర్ణలత, సీడీపీవో జ్యోతి, సూపర్వైజర్లు అనసూర్య, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.