
గొల్లపల్లి/ధర్మారం, వెలుగు: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ పురంశెట్టి పద్మ– వెంకటేశం కొడుకు గొల్లపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురంశెట్టి గౌతం రాజ్ వివాహం ఇటీవల జరిగింది. గురువారం వారి స్వగృహంలో కొత్త జంటను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం ఆశీర్వదించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, మాజీ సర్పంచులు సత్యనారాయణ గౌడ్, గంగాధర్, రెవెల్ల లింగన్న, తదితరులు ఉన్నారు. అంతకుముందు మార్గమధ్యలో ధర్మారంలో ఆగిన వివేక్వెంకటస్వామిని సీనియర్ నాయకుడు, కాకా అభిమాని కాడే సూర్యనారాయణ స్థానిక లీడర్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈసందర్భంగా వివేక్ను శాలువాతో సన్మానించారు. లీడర్లు పాలకుర్తి రాజేశం గౌడ్, పొన్నవేని స్వామి, దేవి కిశోర్, గాజుల లక్ష్మణ్, సత్యనారాయణ, అస్షు పాల్గొన్నారు.