
హన్వాడ, వెలుగు: పేద ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండలంలోని కొత్తపేట, టంకర, పెద్ద దర్పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ప్రోసీడింగ్స్ పత్రాలు అందించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. టంకర గ్రామంలోని రైతు వేదిక దగ్గర పలువురు రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు ఎవరు అమ్మినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్ పీ వెంకటేశ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ప్రజలు పాల్గొన్నారు.