
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబూబాబాద్రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. సోమవారం రైల్వే స్టేషన్ ను సందర్శించి, పనులను పరిశీలించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
అనంతరం ఏడీఆర్ఎం రాధాకృష్ణన్ కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, నాయకులు కన్నా, కరుణాకర్ రెడ్డి, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.