
నిజామాబాద్, వెలుగు: ఆర్మూర్, పటన్చెరు మీదుగా అదిలాబాద్కు కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నట్లు కేంద్ర రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ లెటర్ పంపారని బుధవారం ఎంపీ అర్వింద్ మీడియాకు తెలిపారు. కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం తాను సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ను పలుమార్లు కలిసి విన్నవించానన్నారు.
ఈ క్రమంలో రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పూర్తయ్యాయని వివరించారు. కొత్త రైల్వే లైన్ మంజూరు చేసిన కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.