బండి సంజయ్ కార్పొరేటర్లా మాట్లాడుతున్నడు : ఎంపీ చామల

బండి సంజయ్ కార్పొరేటర్లా మాట్లాడుతున్నడు : ఎంపీ చామల
  • ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: కరీంనగర్​లో  కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరు చూస్తే మున్సిపల్ కార్పొరేటర్​లా ఉందని కాం గ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం గాంధీ భవన్​లో చామల మీడియాతో మాట్లాడారు.

 ఓట్ చోరీ గురించి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్.. కరీంనగర్ టూర్​లో మాట్లాడితే బండి సంజయ్ దానికి సూటిగా సమాధానం చెప్పకుండా సంబంధం లేని మాటలు మాట్లాడాడని ఆరోపించారు. పరిపక్వత లేని రాజకీయ నాయకుని తీరు సంజయ్​లో కనిపించిందని విమర్శించారు.