ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్ చేయాలి : ఎంపీవో హరి

ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్ చేయాలి  : ఎంపీవో హరి

లింగంపేట, వెలుగు :  మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్​ చేయాలని ఎంపీవో హరి సూచించారు. శనివారం మెంగారం గ్రామంలో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు.  బేస్మెంట్​వరకు పూర్తైతే  రూ.లక్ష, రూప్ లెవల్ వరకు పూర్తైతే మరో లక్ష, లెంటల్ లెవల్​ వరకు రూ.లక్ష, స్లాబ్ పూర్తై తే రూ. రెండు లక్షలు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయని చెప్పారు.  అనంతరం గ్రామంలోని  అంగన్​వాడీ కేంద్రాన్ని  పరిశీలించారు. ఆయన  వెంట పంచాయతీ సెక్రటరీ బాలమణి, సిబ్బంది దత్తు ఉన్నారు.