మార్కెట్లో కల్తీ వస్తువులు కలకల రేపుతున్నాయి. కొందరు దళారులు నకీలీ వస్తువులను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ వస్తువులను కస్టమర్లకు అంటగడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మార్కెట్లో వ్యాపారులు అమ్ముతున్న వస్తువులు కల్తీవా? లేక అసలు వస్తువులా? అనేది పోలిక లేకుండా తయారు చేస్తున్నారు. కల్తీ నూనెలు, కల్తీ ఛాయ్ పత్తా, షాంపు లాంటి నకిలీ వస్తువులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
లేటెస్ట్ గా 16 లక్షలు విలువ చేసే నకిలీ నిత్యావసర సరుకులను సీజ్ చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గోడౌన్ లో నాసిరకం సరుకు స్టోర్ చేసిననట్లు గుర్తించిన పోలీసులు పక్కా సమాచారంతో తనిఖీలు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. అజయ్, సయ్యద్ ఇమ్రాన్, పుఖ్రా రాజ్ పురోహిత్, ప్రేమ్ రాజ్ పురోహిత్ లను అరెస్ట్ చేశారు. నిత్యావసర వస్తువులు కల్తీ చేయడం చూసి అధికారులు, పోలీసులు విస్తుపోయారు.