
సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. గోపి అచ్చర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్పై బి నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్కు సత్యదేవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టారు. వంశీ నందిపాటి ఫస్ట్ షాట్కు దర్శకత్వం వహించారు. యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్కు షణ్ముక ప్రశాంత్ కథను అందించాడు.
సుహాస్కు జంటగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’లో నటించిన శివాని ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. నరేష్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహి రెడ్డి పండుగుల సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి విప్లవ్ నైషదం ఎడిటర్గా, ఎ రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు.