స్టూడెంట్స్కు ఆల్బెండాజోల్మాత్రలు పంపిణీ

స్టూడెంట్స్కు ఆల్బెండాజోల్మాత్రలు పంపిణీ

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు స్కూళ్లలోని స్టూడెంట్స్​కు ఆల్బెండాజోల్​ మాత్రలను పంపిణీ చేశారు. ఖమ్మంలో కలెక్టర్​ అనుదీప్, భద్రాచలంలో ఐటీడీఏ పీవో బి.రాహుల్, అన్నపురెడ్డి మండల పరిధిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్​నాయక్​తో పాటు ఆయా చోట్ల పలువురు అధికారులు, నాయకులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మాత్రల ద్వారా పిల్లల్లో రక్తహీనత, బుద్ధి మాంద్యతగా నివారించి చదువుల్లో వారిలో ఏకాగ్రతను పెంచుతుందన్నారు. విద్యాశాఖ, ఏఎన్​ఎం, అంగన్​వాడీలు కలిసి పనిచేసి ప్రతీ స్టూడెంట్​కు ఈ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు.  – వెలుగు, నెట్​వర్క్​