మంత్రి  దామోదర్ రాజనర్సింహని కలిసిన సంగారెడ్డి కలెక్టర్

మంత్రి  దామోదర్ రాజనర్సింహని కలిసిన సంగారెడ్డి కలెక్టర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.ప్రావీణ్య బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను స్థానిక ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  పథకాలను ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. 

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని..

కలెక్టర్ ప్రావీణ్య జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవాని చంద్రను సంగారెడ్డి కోర్టులోని ఆమె చాంబర్​లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు.