జూన్ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్

జూన్ 12  నుంచి స్కూల్స్ రీ ఓపెన్
  • మొదటి రోజే  యూనిఫాం,  బుక్స్​ పంపిణీకి చర్యలు
  • ఉమ్మడి జిల్లాలో సర్కారీ స్కూళ్లలో  అడ్మిషన్లు పెంచడంపై  ఫోకస్​

కామారెడ్డి/ నిజామాబాద్​, వెలుగుసమ్మర్ హాలిడేస్​ ముగియడంతో గురువారం  స్కూల్స్​  రీ ఓపెన్​ కానున్నాయి.   ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో  బడిగంట మోగేందుకు అంతా రెడీ అయ్యింది.  రీఓపెన్ రోజే  గవర్నమెంట్ స్కూల్స్​లో  విద్యార్థులకు యూనిఫాం, టెక్ట్స్,  నోటు బుక్స్​ అందించేందుకు ఏర్పాట్లు చేశారు.  ఇప్పటికే చాలా వరకు  బుక్స్  స్కూల్స్​కు చేరగా, సగానికన్ని ఎక్కువగా యూనిఫాంలు కూడా వచ్చాయి.  

గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్లు  పెంచేందుకు  బడి బాట కార్యక్రమం నిర్వహించారు.  అంగన్​వాడీల్లో ప్రీ ప్రైమరీ పూర్తి చేసుకున్న పిల్లలను స్కూళ్లలో చేర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  డ్రాపవుట్స్​,   ప్రైవేట్ స్కూళ్ల స్టూడెంట్లను కూడా  ప్రభుత్వ బడుల్లో చేర్చుకోవటంపై ఫోకస్​ పెట్టారు. 

ఉమ్మడి జిల్లాలో  2,04,559 మంది  విద్యార్థులు     

ఉమ్మడి జిల్లాలోని  గవర్నమెంట్​ స్కూల్స్​లో 2, 04,559 మంది  విద్యార్థులున్నారు. వీరికి ఉచితంగా టెక్స్ట్​, నోట్​ బుక్స్​ ఇస్తారు.  ఇప్పటికే   90 శాతం  బుక్స్​ స్కూల్స్​కు చేరుకున్నాయి.  కామారెడ్డి జిల్లాలో   ప్రభుత్వ స్కూల్స్​, రెసిడెన్షియల్​, కేజీబీవీ, మాడల్ స్కూల్స్​  1,081 ఉండగా ఇందులో  82,295 మంది విద్యార్థులు ఉన్నారు.  వీరికి  5.30 లక్షల టెక్ట్స్​ బుక్స్​ అవసరం కాగా 8,9 క్లాస్​లకు సంబంధించి హిందీ తప్ప   4.77 లక్షల బుక్స్​ స్కూల్స్​కు చేర్చారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 7,279  స్కూల్స్​ఉన్నాయి. మొత్తం 1,22,264 మంది స్టూడెంట్స్​కు   7,18,590  టెక్ట్స్​ బుక్స్​ అవసరం. ఇప్పటికే  6,88,310 బుక్స్​చేరాయి.   

యూనిఫాం కోసం  ప్రభుత్వం సప్లై చేసిన క్లాథ్​ను  మహిళ సంఘాలకు ఇవ్వగా .. వారు స్టూడెంట్స్​ సైజుల  ప్రకారం   డ్రెస్సులు కుట్టారు.   కామారెడ్డి జిల్లాలో  80 శాతం వరకు,  నిజామాబాద్​ జిల్లాలో 40 శాతం వరకు తయారీ కంప్లీట్​ అయ్యింది.  ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో  66వేలు, నిజామాబాద్​ జిల్లాలో  47,960  యూనిఫాంలు   స్కూల్స్​కు పంపారు.  గురువారం నాడు  ఒక్కో విద్యార్థికి ఒక  జత యూనిఫాం ఇవ్వనున్నారు. రెండో జత వారం రోజుల్లో ఇవ్వాలని  భావిస్తున్నారు. 

టీచర్ల విస్తృత ప్రచారం..

గవర్నమెంట్ స్కూల్స్​లో విద్యార్థుల ప్రవేశాలపై  ప్రభుత్వం ఫోకస్​ చేసింది.  అంగన్​వాడీల్లో  ప్రీప్రైమరీ పూర్తయిన వారిని   1వ తరగతిలో చేర్చనున్నారు.  బడి మధ్యలో మానేసిన వారిని కూడా తిరిగి  స్కూళ్లలో చేరేలా మోటివేట్​ చేస్తున్నారు. ఈ నెల 6 నుంచి బడిబాట పోగ్రాం జరిగింది.   గ్రామాల్లో  హెచ్​ఎంలు, టీచర్లు  ఇంటింటికీ  తిరుగుతూ ప్రభుత్వ బడిలో చేరాలని ప్రచారం చేశారు.   స్కూల్స్​ రిజల్ట్,  వసతులు, ఫ్రీగా  బుక్స్, యూనిఫాం పంపిణీ,  మిడ్​ డే మీల్స్​తదితర అంశాలతో కరపత్రాలు పంచారు.

 పలుచోట్ల  ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.   ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల స్కూళ్లలో సమస్యలు నెలకొన్నాయి.  కొన్ని చోట్ల  క్లాస్​ రూమ్స్​ నిర్మాణం  మధ్యలో  అగిపోయింది.  టాయిలెట్లు, టీచర్ల  కొరత వేధిస్తోంది.    విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్ధుబాటు చేసుకొవచ్చని జిల్లా అధికారులకు ఇటీవల ప్రభుత్వం సూచించింది.

 ఏర్పాట్లు చేశాం

 స్కూల్స్​ రీ ఓపెన్​కు జిల్లాలో  అన్ని  ఏర్పాట్లు చేశాం. బుక్స్​  స్కూల్స్​కు చేరాయి.  యూనిఫాంలు 80 శాతం స్టిటింగ్​  కంప్లీట్​ చేసి స్కూల్స్​కు ఇచ్చారు.  ఫస్ట్​ డేనే  బుక్స్​, నోటుబుక్స్​, యూనిఫాంలు ఇస్తాం.  అడ్మిషన్లు  పెంచటానికి బడిబాటలో భాగంగా ప్రచారం చేశాం.  -   రాజు, డీఈవో  కామారెడ్డి