
నిజామాబాద్, వెలుగు : నగర శివార్లోని సారంగపూర్ వద్ద సర్వే నంబర్ 231లోని సర్కార్ ల్యాండ్ ఆక్రమించి వెంచర్ వేస్తున్నారని మజ్లిస్ పార్టీ జిల్లా ప్రెసిడెండ్ ఫయాజ్ తెలిపారు. రూ.20 కోట్ల విలువ గల భూకబ్జా ఆపాలని కలెక్టర్ రాజీవ్గాంధీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఆక్రమణ మొదలైందని చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్డీవో ద్వారా ఎన్క్వయిరీ చేయిస్తానని భరోసా ఇచ్చారు.