
(రెంజల్) నిజామాబాద్, వెలుగు : గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద బారికేడ్లు పెట్టడంతోపాటు రెండు వైపులా తాళ్లు కట్టి ప్రమాదాలను కట్టడి చేయాలని సీపీ సాయిచైతన్య కోరారు. బుధవారం రెంజల్ మండలం కందకుర్తి గోదావరి పుష్కర్ ఘాట్ పరిసరాలను పరిశీలించి మాట్లాడారు.
మొక్కులు తీర్చుకోవడానికి, పుణ్య స్నానాలు చేసేందుకు నదుల్లోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రమాద సూచికలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్బాబు, ఎస్సై చంద్రమోహన్ తదితరులు ఉన్నారు.