చెత్త బండి రావడం లేదంటూ.. చెత్త డబ్బాలతో నిరసన

చెత్త బండి రావడం లేదంటూ.. చెత్త డబ్బాలతో నిరసన

వికారాబాద్ జిల్లా: పరిగి మున్సిపాలిటీలోని 14వ వార్డు కాలనీ వాసులు విన్నూత్న నిరసన తెలిపారు. పది రోజులుగా తమ కాలనీకి మున్సిపల్ చెత్త బండి రావడం లేదంటూ.. చెత్త డబ్బాలు రోడ్డుపై ఉంచి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది తమ కాలనీని పట్టించుకోవటం లేదన్నారు..పది రోజులుగా చెత్త బండి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. చెత్త బయట పడేస్తే ఫైన్ వేస్తామని బెదిరిస్తున్నారన్నారు. మున్సిపల్ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.