హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) నిర్వహించిన ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్లో 47.17% మంది, ఎస్ఎస్సీలో 49.71% మంది పాసైనట్లు టాస్ డైరెక్టర్ పీవీశ్రీహరి, జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి తెలిపారు.
ఎస్ఎస్సీలో 30,564 మంది పరీక్ష రాస్తే 15,193 మంది పాసయ్యారు. దీంట్లో అమ్మాయిలు 6,352 మంది, అబ్బాయిలు 8,841 మంది ఉన్నారు. 9–10 జీపీఏ సాధించిన వారు కేవలం ఒక్కరే ఉన్నారని సోమిరెడ్డి వెల్లడించారు. 42,026 మంది ఓపెన్ ఇంటర్ రాయగా, 19,813 మంది పాస్ అయ్యారు. వీరిలో అమ్మాయిలు 7,682 మంది, అబ్బాయిలు 12,131 మంది ఉన్నారు. రీకౌంటింగ్, రీవాల్యువేషన్ కోసం ఈనెల 24 నుంచి వచ్చే నెల 4 వరకూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు.