మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు... పవన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

 మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు... పవన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై కేసులు పెట్టడానికి వైసీపీ  సర్కారు అనుమతి ఇచ్చింది. సీసీపీ 199/4 ప్రకారం పవన్ పై కేసుల నమోదుకు అనుమతిస్తూ, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ గురువారం (జులై20)ఉత్తర్వులు జారీ చేసింది.

పవన్ పై పరువు నష్టం కేసులు పెట్టాలని.. . గ్రామవార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయని నోటీసుల్లో పేర్కొన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై వివిధ పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేసులు నమోదు చేశారు.  మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపారు.

ఏపీలో వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ వాలంటీర్లపై అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో మహిళలు అదృశ్యమవుతున్నారని పవన్ అన్నారు. వాలంటీర్లు డేటా సేకరిస్తున్నారని, అదంతా ఎవరికి చేరుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే పవన్ పై కొన్ని పోలీస్ స్టేషన్లలో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ సురేశ్ ఇటీవల చేసిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.