పిట్లం విద్యార్థులను అభినందించిన గవర్నర్​

పిట్లం విద్యార్థులను  అభినందించిన గవర్నర్​

పిట్లం, వెలుగు : జాతీయ స్థాయి ట్రైనింగ్​క్యాంపులో ప్రతిభ చూసిన పిట్లం బ్ల్యూబెల్స్​స్కూల్ విద్యార్థులను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. గురువారం రాజ్​భవన్​కు విద్యార్థులను పిలిపించి గవర్నర్ ఆశీర్వదించారు. మార్చి 24 నుంచి వారం రోజులపాటు భువనేశ్వర్​లో జరిగిన జాతీయ స్థాయి ట్రైనింగ్​క్యాంపులో పిట్లం బ్లూబెల్స్ స్కూల్ విద్యార్థులు పుట్నాల వాసవి, నీరుడి లోకిత, భోగం సాత్విక, గుడిపల్లి శ్రీనికారెడ్డి, కొండ సంధ్య, కంకరి శ్రావణితోపాటు గర్ల్స్ హైస్కూల్​కు చెందిన సీహెచ్​సంజన, వడ్ల స్నేహ పాల్గొన్నారు. 

క్యాంపులో సైబర్ క్రైం క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన, జనరల్​ నాలెడ్జ్, బెస్ట్ డిసిప్లిన్ గ్రూప్​ అంశాల్లో పిట్లం విద్యార్థులు ప్రతిభ కనబర్చారని రెడ్​క్రాస్ స్టేట్ ఎంసీ అండ్​జేఆర్​సీ మెంబర్ డాక్టర్​ సంజీవరెడ్డి తెలిపారు. గవర్నర్​ను కలిసిన వారిలో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, రెడ్ క్రాస్ స్టేట్ వైస్​చైర్మన్ శ్రీరాములు, బ్లూబెల్స్ స్కూల్​టీచర్ మంగళం ఉన్నారు.