ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకున్నాం : బి.వినోద్ కుమార్

ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకున్నాం : బి.వినోద్ కుమార్

ముస్తాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలు ఆంక్షాలను నెరవేర్చుకున్నామని, సీఎం కేసీఆర్​పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని ప్లానింగ్​ కమిషన్​ వైస్​చైర్మన్​బి.వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్​ అన్నారు. ఆదివారం ముస్తాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మద్దికుంటలో డబుల్ బెడ్రూం ఇండ్లు, పల్లె ప్రకృతి వనం, హెల్త్ సెంటర్, అంగన్ వాడీ, మహిళా సంఘం భవనాలు, వైకుంఠ ధామాలను ప్రారంభించారు.

బదనకల్‌‌‌‌‌‌‌‌లో 132/11 సబ్ స్టేషన్, కొత్త జీపీ భవనాన్ని ప్రారంభించారు.  ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతు వేదికలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మండలంలో కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులను వినోద్ కుమార్  సన్మానించారు.  జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ అరుణ, టెస్కాబ్ చైర్మన్​ రవీందర్ రావు,  సెస్ చైర్మన్ రామారావు, ఎంపీపీ శరత్ రావు, జడ్పీటీసీ నర్సయ్య, గోపాల్​రావు పాల్గొన్నారు.