
గుండాల, వెలుగు : కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం మండలంలోని దామరతోగు ఎస్సీ కాలనీలో అడిషనల్ ఎస్పీనరేందర్ దోమతెరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు మావోయిస్టులకు సహకరించకుంటే మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రబాన్, సీఐ రవీందర్, ఎస్సై రాహుల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.