Mirai: రిలీజ్ ముందే మిరాయ్కి క్రేజీ టాక్.. అశోకుడు, శ్రీరాముడు పాత్రల్లో స్టార్ హీరోస్..!

Mirai: రిలీజ్ ముందే మిరాయ్కి క్రేజీ టాక్.. అశోకుడు, శ్రీరాముడు పాత్రల్లో స్టార్ హీరోస్..!

గత చిత్రాలను మించి తాను లోతుగా ఇన్వాల్వ్‌‌‌‌‌‌‌‌ అయ్యి తెరకెక్కించిన సినిమా ‘మిరాయ్‌‌‌‌‌‌‌‌’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌‌‌‌‌‌‌‌. తేజ సజ్జా హీరోగా కార్తీక్‌‌‌‌‌‌‌‌ ఘట్టమనేని దర్శకత్వంలో ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి టీజీ విశ్వ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ ఇలా ముచ్చటించారు.
    
మార్కెట్‌‌‌‌‌‌‌‌ లెక్కలు వేసుకోకుండా ఒక అద్భుతమైన చిత్రాన్ని అందివ్వాలనే ఉద్దేశ్యంతో చేసిన సినిమా ‘మిరాయ్‌‌‌‌‌‌‌‌’. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి తేజకు ‘హనుమాన్‌‌‌‌‌‌‌‌’ లాంటి బ్లాక్ బస్టర్ లేదు. మేం తనతో పాటు ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ని నమ్మాం. మంచి కథతో పాటు చక్కని మ్యూజిక్, గ్రేట్ లొకేషన్స్‌‌‌‌‌‌‌‌, అద్భుతమైన గ్రాఫిక్స్‌‌‌‌‌‌‌‌  కుదిరాయి. 
    
అశోకుడు మొత్తం జ్ఞానాన్ని నిక్షిప్తం చేసిన 9 గ్రంథాల రక్షణ బాధ్యతను ఎనిమిది మంది యోధులకు ఇస్తాడు. ఒకటి మాత్రం ఓ ఆశ్రమానికి ఇస్తాడు. ఆ గ్రంథాల ప్రాముఖ్యత ఏమిటి.. వాటి గురించి హీరో, విలన్‌‌‌‌‌‌‌‌ ఎలాంటి పోరాటం చేశారనేది అద్భుతమైన ఫాంటసీ అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కించాం. చరిత్రతో పాటు ఫిక్షన్ కూడా ఇందులో కలగలిసి ఉంటుంది. ఒక తల్లి సంకల్పంతో ముడిపడిన కథ ఇది. 
    
ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీ రాముడు కనిపించిన సీన్‌‌‌‌‌‌‌‌ సహా ఇందులోని ప్రతి ఎలిమెంట్‌‌‌‌‌‌‌‌కి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. అశోకుడిగా ఒక స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూడబోతున్నారు. అది ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌‌‌‌‌‌‌‌. అలాగే ఇందులో  8 నుంచి 10 లార్జ్‌‌‌‌‌‌‌‌ స్కేల్‌‌‌‌‌‌‌‌ ఎపిసోడ్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. 
    
‘మిరాయ్‌‌‌‌‌‌‌‌’ కోసం తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. యాక్షన్ సీన్స్‌‌‌‌‌‌‌‌ కోసం థాయిలాండ్‌‌‌‌‌‌‌‌లో శిక్షణ తీసుకున్నారు. అలాగే మనోజ్ పవర్ ఫుల్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తారు. కార్తిక్‌‌‌‌‌‌‌‌ బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కావడంతో ఏ సీన్‌‌‌‌‌‌‌‌ లొకేషన్‌‌‌‌‌‌‌‌లో తీయాలి, దేనికి సెట్‌‌‌‌‌‌‌‌ వేయాలి, గ్రాఫిక్స్‌‌‌‌‌‌‌‌కు ఎంతవరకు వాడుకోవాలనే విషయంపై తనకు ఫుల్‌‌‌‌‌‌‌‌ క్లారిటీ ఉంది.

అలాగే వీఎఫ్ఎక్స్ వర్క్‌‌‌‌‌‌‌‌ మా సంస్థలోనే చేయడం గొప్ప అడ్వాంటేజ్. గ్రాఫిక్స్ బయటికి ఇస్తే చాలా సమస్యలు. వాళ్ళు ఇచ్చిన అవుట్‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలి. ఇన్ హౌస్ చేయడం వల్ల మన కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది.  
    
ఇందులో 20 అడుగుల ఎత్తున్న సంపాతి అనే పక్షి సీన్‌‌‌‌‌‌‌‌ కోసం 30 వేల అడుగుల విస్తీర్ణంలో భారీ సెట్‌‌‌‌‌‌‌‌ వేశాం. ఆ పక్షిని యానిమాట్రిక్స్ టెక్నాలజీతో చేశాం. ఇది చాలా కాంప్లెక్స్ వర్క్. పక్షితో హ్యూమన్ ఇంటరాక్షన్ వున్న సినిమా మన దేశంలో ఇంతవరకూ రాలేదని భావిస్తున్నా. గత చిత్రాలతో పోల్చితే నేను డీప్‌‌‌‌‌‌‌‌గా ఇన్వాల్వ్ అయిన చేసిన సినిమా ఇదే. ఏడాదిన్నరగా ఈ సినిమాతోనే ఎక్కువ ట్రావెల్ అవుతున్నా. 

ALSO READ : యూత్‌ క్రేజీగా సిద్దమవ్వండి!
    
చూడ్డానికి రూ.300 కోట్ల సినిమాలా అనిపించినా టికెట్ రేట్స్‌‌‌‌‌‌‌‌ పెంచాలనుకోవడం లేదు. ఎంత ఎక్కువమంది చూశారు అనేదానిపైనే మా దృష్టి ఉంది. 2018 నుంచి మా సంస్థ ద్వారా వరుస చిత్రాలు వచ్చాయి. అయితే 2024 మమ్మల్ని డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడు ‘మిరాయ్‌‌‌‌‌‌‌‌’తో కం బ్యాక్ ఇస్తామని పూర్తి కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. 
    
‘ది రాజాసాబ్’ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న వస్తుంది. అక్టోబర్‌‌‌‌ 2న ట్రైలర్‌‌‌‌ రిలీజ్ కానుంది. ‘కాంతార చాప్టర్‌‌‌‌ 1’ రిలీజ్‌‌ అయ్యే థియేటర్స్‌‌లో ట్రైలర్‌‌‌‌ ప్రదర్శించబోతున్నాం. అలాగే ప్రభాస్‌‌ గారి బర్త్‌‌ డేకు ఫస్ట్ సింగిల్‌‌ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం.