టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : జూకంటి బాపురెడ్డి

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : జూకంటి బాపురెడ్డి
  •  రాష్ర్ట పీఆర్టీయూ అసోసియేట్ ప్రెసిడెంట్ బాపురెడ్డి 

సదాశివనగర్, వెలుగు : టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పీఆర్టీయూ అసోసియేట్​ ప్రెసిడెంట్ జూకంటి బాపురెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఉత్తునూర్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.

 టీచర్ల సమస్యలను ఎప్పటికప్పుడు సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నానన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ జీతాలు వేస్తున్నందుకు కాంగ్రెస్​ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండలాధ్యక్షుడు గాదారి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బసంత్,  మండల సహ అధ్యక్షుడు బాల్ కిషన్​, హెచ్​ఎం శ్రీనివాస్​ రెడ్డి,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.