
రాజ్ తరుణ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రఫ్ నోట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. సునీల్, ‘ప్రేమిస్తే’ భరత్, పాల్ తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ వరుసలో తమిళ నటి అమ్ము అభిరామి చేరింది.
రాట్సనన్, అసురన్ లాంటి తమిళ చిత్రాలతో ఆకట్టుకున్న ఆమె.. దర్శకుడు విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ‘గోలీసోడా’ వెబ్ సీరిస్లోనూ కీలకపాత్రను పోషించింది. ఇప్పుడు మరోసారి అదే దర్శకుడితో కలిసి వర్క్ చేయబోతోంది. ఇందులో ఆమె క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్గా, ఎమోషనల్గా ఉండబోతోందని, తన నటన ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ సందర్భంగా తెలియజేశారు.