ఐటీ కారిడార్లో డ్రగ్స్ పట్టివేత

ఐటీ కారిడార్లో డ్రగ్స్ పట్టివేత

చందానగర్​, వెలుగు: ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా మహరాష్ర్ట నుంచి హైదరాబాద్​కు ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్న వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్​ చేశారు. గురువారం సాయంత్రం మణికొండలోని ఆంధ్రబ్యాంక్​ వద్ద డ్రగ్స్​ అమ్ముతున్నారనే సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అనుమానాస్పదంగా బ్యాగులతో సంచరిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎండిన పువ్వులు, పండ్లతో కూడిన గంజాయిని, జిప్​లాక్​ కవర్లలో ఎండీఎంఏను గుర్తించారు. 

మహరాష్ట్ర నాందేడ్​ జిల్లా కిన్వాట్​ గ్రామానికి చెందిన సోహెల్​ లతీఫ్​ ఖాన్​(29) ర్యాపిడో డ్రైవర్​గా పనిచేసి.. వచ్చే డబ్బులు చాలకపోవడంతో డ్రగ్స్​ సప్లయర్​గా మారాడు. ఈయనతో పాటు డ్రగ్స్​ కొనేందుకు వచ్చిన ఆర్యన్​ దీప్​ సింగ్(24), మన్​రాజ్​సింగ్(26), శుభమ్​ ఆనంద్​(29), రాబిన్​సింగ్​(24), అజయ్​కుమార్​ సాహో(28)ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్​ చేశారు. 3.1 గ్రాముల ఎండీఎంఏ, 17.2 కేజీల గంజాయి, రూ. 20 వేలు, 6 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.