లారీ, బైకు ఢీ కొని ముగ్గురు యువకులు మృతి

లారీ, బైకు ఢీ కొని  ముగ్గురు యువకులు మృతి

ప్రకాశం జిల్లా తర్లుపాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కలుజువ్వలపాడు దగ్గర లారీ, బైకు  ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు  అక్కడిక్కడే మృతి చెందారు.  

ఈ  విషయంపై తెలుసుకున్న  పొదిలి సిఐ రాఘవేంద్ర రావు, తర్లుపాడు యస్ఐ వేముల సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు . మృతులు అంబాపురం గ్రామానికి చెందిన వినోద్(18) ,నానీ(16), వీరేంద్ర(17) గుర్తించారు. మృతేహాలను పోస్టుమార్టం కోసం  స్థానిక  ఆస్పత్రికి తరలించారు. మృతులంతా చిన్న వయసున్న వారు కావడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.