- మినీ వ్యాన్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- ప్రయాణికులకు స్వల్ప గాయాలు
జడ్చర్ల, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచవరం వద్ద హైదరాబాద్–బెంగళూరు హైవేపై బుధ వారం మినీ వ్యాన్ ను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 16 మంది ప్రయాణికులు స్వల్పగాయలతో బయట పడ్డారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నాటకలోని రాయచూర్కు 50 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరింది.
మాచారం వద్ద ముందు వెళ్తున్న మినీ వ్యాన్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వ్యాన్ అదుపు తప్పి పక్కనే వెళ్తున్న కారును, డివైడర్ ను ఢీకొట్టి రోడ్డుకు అవతల పల్టీ కొట్టింది. ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108లో బాధితులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కమలాకర్ తెలిపారు.
