- భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో..స్వదేశానికి తిరిగారావడంలో సాయం
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో కష్టాల్లో చిక్కుకున్న భారతీయులకు సోనూసూద్ ఆపన్నసాయం అందిస్తున్నారు. ఉక్రెయిన్ లో ఉన్న తన టీమ్ సభ్యుల ద్వారా భారతీయులు క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చేందుకు అవసరమైన సహాయం అందిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుని దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ కార్యక్రమం పేరుతో ఏర్పాట్లు చేయగా.. సోనుసూద్ కూడా తనవంతుగా సాయం అందించే బృందాలను రంగంలోకి దింపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ.. ఉక్రెయిన్ లో చిక్కుకుని స్వదేశానికి రావడానికి ఇబ్బందులుపడుతున్న వారిని గుర్తించి అవసరమైన సహాయం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి