న్యూఢిల్లీ:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మొదటి క్వార్టర్కు మంచి రిజల్ట్స్ ప్రకటించింది. ఈ క్వార్టర్లో స్టేట్ బ్యాంక్ నికర లాభం 55.3 శాతం పెరిగి రూ. 6,504 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో బ్యాంకుకు రూ. 4,189 కోట్ల లాభం వచ్చింది. జూన్ 2021తో ముగిసిన ఫస్ట్ క్వార్టర్లో స్టేట్ బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (నెట్ ఇంటరెస్ట్ ఇన్కం) కూడా 3.15 శాతం పెరిగి రూ. 27,638 కోట్లకు చేరింది. మొదటి క్వార్టర్లో ఇతర ఆదాయం రూ. 11,803 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 7,958 కోట్లు మాత్రమే. జూన్ 2021 నాటికి బ్యాంకు గ్రాస్ ఎన్పీఏలు కొద్దిగా పెరిగి 5.32 శాతమయ్యాయి. నెట్ ఎన్పీఏలూ 1.77 శాతానికి పెరిగాయి. స్లిప్పేజెస్ లేదా కొత్త బ్యాడ్ లోన్లు ఏకంగా నాలుగు రెట్లు పెరిగి రూ. 15,666 కోట్లకు చేరాయి. ప్రొవిజన్లు కొంత తగ్గి రూ. 10,052 కోట్లకు పరిమితమయ్యాయి. కొవిడ్ 19 ఎఫెక్ట్ వల్ల ఎకనమిక్ యాక్టివిటీస్ తగ్గాయని రిజల్ట్స్ ప్రకటన సందర్భంగా ఎస్బీఐ పేర్కొంది. ఈ సవాళ్లను తట్టుకోవడానికి అన్ని విధాల ప్రిపేర్ అవుతున్నట్లు వెల్లడించింది. అప్పులు తీసుకున్న వాళ్లు టైములో తిరిగి చెల్లించలేకపోవచ్చని, అదే విధంగా వర్కింగ్ క్యాపిటల్ సైకిల్స్ కూడా ఎక్స్టెండ్ కావొచ్చని బ్యాంకు తెలిపింది. ఈ ప్రోబ్లమ్స్ను బ్యాంకు ఎదుర్కోవల్సి ఉంటుందని పేర్కొంది. రిజల్ట్స్ ప్రకటన నేపథ్యంలో ఎస్బీఐ షేర్లు 2 శాతం పెరిగి రూ. 456 కి చేరాయి.
