
- ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్అలీ
నిజామాబాద్, వెలుగు: భక్తిశ్రద్ధలతో గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ సూచించారు. గురువారం గణపతి వేడుకలపై పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాన్స్కో ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. మండపాల వద్ద విద్యుత్ సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శోభాయాత్ర జరిగే రూట్లో కరెంట్ తీగలు తగలకుండా చూడాలన్నారు. రోడ్డు గుంతలు పూడ్చాలని సూచించారు.
ఆలయం కమిటీ ప్రమాణ స్వీకరణ
నగరంలోని గోల్హనుమాన్ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి షబ్బీర్అలీ హాజరయ్యారు. చైర్మన్గా బండారి నరేందర్,డైరెక్టర్లుగా తోడుపునూరి రామ్మోహన్, గుండ సుధీర్, కరిపె లింగం, క్యాసారం విజయ్ కుమార్, ఉప్పరి స్వప్న, గంట జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. ఆరెకటిక సంఘం కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన హాజరయ్యారు. నుడా చైర్మన్ కేశవేణు, స్టేట్ అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ గడుగు గంగాధర్, రత్నాకర్ ఉన్నారు.