- మంత్రులు వివేక్, జూపల్లి, ఎంపీ వంశీకృష్ణ చేతుల మీదుగా అందజేత
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనికి చెందిన సీనియర్ట్రేడ్ యూనియన్ లీడర్, లయన్స్క్లబ్జోన్ చైర్మన్ పి.మల్లికార్జున్కు రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డును ప్రకటించింది. మేడే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్.. మల్లికార్జున్కు అవార్డును అందజేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నందున ప్రభుత్వం గుర్తించి ఈ ఆవార్డును అందజేసిందని మల్లికార్జున్ తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు సజ్జద్, కామ విజయ్, విజయరావు, తిప్పారపు మధు, తదితరులు పాల్గొని మల్లికార్జున్కు శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి ప్రాంతానికి చెందిన ట్రేడ్ యూనియన్ లీడర్లు వికాస్కుమార్, టైసన్ శ్రీనివాస్, ఆకునూరి బాలఅంకూస్కు కూడా శ్రమశక్తి అవార్డులు వచ్చాయి.
