
సిద్దిపేట, వెలుగు: మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకట స్వామిని సిద్దిపేట కాంగ్రెస్ నేత సాకి ఆనంద్ నేతృత్వంలో కలిశారు. ఆదివారం ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన తర్వాత ఆయనకు విషెస్చెప్పి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలక భూమిక పోషించిన వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి దక్కడం హర్షనీయమన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు తండ నవీన్, పలువురు కాంగ్రెస్నేతలు ఉన్నారు.